డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం బీజేపీ నేతల ఆందోళన

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం బీజేపీ నేతల ఆందోళన

హైదరాబాద్ మూసాపేట్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బీజేపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై ప్రధాన రహదారిపై బైఠాయించి సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కూకట్ పల్లి, మూసాపేట్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. 

రంగంలోకి దిగిన పోలీసులు రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.