హైదరాబాద్ కేపీ హెచ్ బీలో దారుణం జరిగింది. ఓ యువకుడిని విచారణకు పిలిచిన పోలీసులు ధర్డ్ డిగ్రీ పేరుతో విచక్షణారాహితంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు నడవలేని స్థితికి వెళ్లాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సైబరాబాద్ కమిషనర్ విచారణకు ఆదేశించారు.
నిజాంపేట్ రోడ్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఉండే ప్రణీత్ అనే యువకుడిని కేపీహెచ్ బీ పోలీసులు ఓ కేసు ఎంక్వైరీ కోసం విచారణకు పిలిచారు. అయితే పోలీస్ స్టేషన్ లో తనను తీవ్రంగా కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలైన ప్రణీత్ ముందుగా కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని మెరుగైన ట్రీట్ మెంట్ కోసం కొన్నిరోజుల తర్వాత గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. ఈ విషయం సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు.