హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు జల్ సంచయ్ అవార్డు

హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు  జల్ సంచయ్  అవార్డు

హైదరాబాద్​సిటీ, వెలుగు: కేంద్ర జల్ శక్తి,  జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన‌‌ 'టాప్ మున్సిపల్ కార్పొరేషన్’ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు హైదరాబాద్ మెట్రోవాటర్​ బోర్డుకు జల్ సంచయ్ జన భాగిదారి (జేఎస్​జేబీ) 1.0 అవార్డ్ లభించింది. ఈ అవార్డుతోపాటు నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డికి లేఖ రాశారు.