 
                                    హైదరాబాద్సిటీ, వెలుగు: కేంద్ర జల్ శక్తి, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'టాప్ మున్సిపల్ కార్పొరేషన్’ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డుకు జల్ సంచయ్ జన భాగిదారి (జేఎస్జేబీ) 1.0 అవార్డ్ లభించింది. ఈ అవార్డుతోపాటు నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డికి లేఖ రాశారు.

 
         
                     
                     
                    