కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇండియా ఏఐ మిషన్లో భాగంగా హైదరాబాద్కు చెందిన ఉర్సా కంప్యూట్ సంస్థ దేశీయ ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి గ్రేటర్ నోయిడాలోని ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్లో 2,888 ఎన్విడియా బ్లాక్వెల్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను ( జీపీయూలు) అమర్చుతోంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.25 వేల కోట్ల వరకు ఉంటుంది.
నోయిడా, హైదరాబాద్, విశాఖపట్టణంలోనూ వీటిని నిర్మించనున్నారు. ఈ క్లౌడ్ ప్లాట్ఫారమ్ ద్వారా స్టార్టప్లు, పరిశోధకులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా ఎల్ఎమ్ఎమ్, ఎల్ఎల్ఎమ్లు, ఎస్ఎల్ఎమ్లు, ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసుకోవచ్చు.
