
గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్కార్పొరేషన్ఆఫ్ఇండియా ఎంప్లాయిస్ కోపరేటివ్ హౌసింగ్సొసైటీలో ప్లాట్లు కనిపించకుండా సంధ్య కన్వెన్షన్ యాజమాన్యం రహదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ ప్లాట్ యజమానులు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. దీంతో హైడ్రా,జీహెచ్ఎంసీ అధికారులు జూన్ 17న అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు.
ఈ రోజు ఉదయం నుంచి GHMC హైడ్రా అధికారులు FCI లైఅవుట్ లో రోడ్ మ్యాపింగ్ చేపట్టారు. అధికారులు మ్యాపింగ్ చేస్తుండగా వీడియో తీస్తున్న FCI ప్లాట్ యాజమాని సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ పై సంధ్య కన్వెన్షన్ యండి శ్రీధర్ బాబు సిబ్బందికి దాడికి పాల్పడ్డారని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మే 6న కూల్చివేతలు
గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 124, 125లో 20 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఫర్టిలైజర్స్కార్పొరేషన్ఆఫ్ఇండియా ఎంప్లాయిస్ కోపరేటివ్హౌసింగ్సొసైటీ లేఅవుట్ ఉంది. ఇందులో 162 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ లేఅవుట్కు ఆనుకొని సంధ్య కన్వెన్షన్ఉంది. అయితే కొంత కాలంగా ఎఫ్సీఐ సొసైటీ ఫ్లాట్ల యజమానులకు, సంధ్య కన్వెన్షన్ఎండీ శ్రీధర్రావు మధ్య స్థల వివాదం నడుస్తోంది. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఈ వివాదంపై విచారణ జరుగుతోంది. వివాద భూమిలోనే శ్రీధర్రావు ఎలాంటి అనుమతులు లేకుండా సంధ్య కన్వెన్షన్మినీ హాల్, వంట గదులు, రెస్ట్రూంలు, డెస్సింగ్రూంలుగా జీ ప్లస్ 2 పద్దతితో మూడు ఐరన్షెడ్లను నిర్మించారు.
లేఅవుట్ చుట్టూ భారీ రేకుల ఫెన్సింగ్ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఎఫ్సీఐ ఫ్లాట్ల యజమానులు హైడ్రా దృష్టికి తీసుకు వెళ్లారు. తమ ఫ్లాట్లు గుర్తుపట్టకుండా రోడ్లను, పార్కులను కలుపుతూ అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. అక్రమ షెడ్ల కోసం సిమెంట్రోడ్డును నిర్మించారని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు మే 6న భారీ హిటాచీలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ వద్దకు చేరుకొని అనుమతులు లేకుండా నిర్మించిన సంధ్య కన్వెన్షన్మినీ హాల్, జీ ప్లస్ 2 పద్దతితో నిర్మించిన మూడు ఐరన్షెడ్లను కూల్చివేశారు. ఐరన్ ఫెన్సింగ్ను, సిమెంట్ రోడ్డును కూడా తొలగించారు. ఇవాళ మరోసారి అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు.