హైడ్రా గ్రీవెన్స్కు 46 అర్జీలు.. ప్రభుత్వభూమి డంపింగ్ యార్డ్ గా మారింది.. స్థానికులు ఫిర్యాదు

హైడ్రా గ్రీవెన్స్కు 46 అర్జీలు.. ప్రభుత్వభూమి డంపింగ్ యార్డ్ గా మారింది.. స్థానికులు ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం జరిగిన ప్రజావాణికి 46 ఫిర్యాదులందాయి. అర్జీలను హైడ్రా క‌‌మిష‌‌నర్  ఏవీ రంగ‌‌నాథ్  ప‌‌రిశీలించి ప‌‌రిష్కార బాధ్యత‌‌ల‌‌ను సంబంధిత అధికారుల‌‌కు అప్పగించారు. 

మేడ్చల్ మండ‌‌లంలోని కండ్లకోయ విలేజ్‌‌లో కోర్టు భ‌‌వ‌‌నం, ట్రాఫిక్ పోలీస్​ స్టేష‌‌న్‌‌, స‌‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌‌యం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి డంపింగ్ యార్డుగా మారిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు. 

ఆ స్థలాన్ని  ప్రభుత్వ కార్యాల‌‌యాల‌‌ కోసమే వినియోగించేలా చూడాలన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండ‌‌లం కురుముల‌‌గూడ జ‌‌న్నారం కాల‌‌నీలో రాజీవ్ గృహ‌‌క‌‌ల్పలో ఉంటున్న వారు పార్కింగ్ కోసం ఉంచిన స్థలాన్ని కబ్జా చేశారని పలువురు కంప్లయింట్​ ఇచ్చారు. బాచుప‌‌ల్లి మండ‌‌లం నిజాంపేట విలేజ్‌‌లో తుర్క చెరువు కబ్జాపై ఫిర్యాదు వచ్చింది.

 కలెక్టరేట్ లో 390 ఫిర్యాదులు...

హైదరాబాద్ కలెక్టరేట్​  ప్రజావాణిలో  జిల్లా రెవెన్యూ అధికారి వెంక‌‌టాచారితో క‌‌లిసి అడిషనల్​ కలెక్టర్ కదిరవన్ పలని ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి 390 ఫిర్యాదులు వచ్చాయి.