యజ్ఞం పూర్తయ్యాక స్పందిస్తా
హైదరాబాద్: ఎలక్షన్ కమిషన్ నోటీసు అందిందని, తానేమి తప్పుగా మాట్లాడలేదన్నారు బీజేపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎన్నికల కమీషన్ నోటీస్ జారీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ పాలనలో జరిగిన విషయాలను ప్రస్తావించానని, యూపీలో ఒకప్పటి గూండా రాజ్యం గురించి మాట్లాడానన్నారు. హిందూ రైతుల భూములను కబ్జా చేసి, వారి నుంచి డబ్బులు దోచుకున్న గూండాలను యూపీ సీఎం యోగి కట్టడి చేశారని అన్నానన్నారు. యోగి, అఖిలేష్ పాలన మధ్య ఉన్న తేడాను ప్రస్తావించానన్నారు. యోగి మళ్లీ సీఎం కావాలని రాజస్థాన్ ఉజ్జయినీ దేవాలయంలో యజ్ఞం చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి: