
అథర్వ మూవీ ఫేమ్ కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ఐ హేట్ యు. అంజి రామ్ దర్శకత్వంలో నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సందర్బంగా నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ.. ఇదొక లవ్ సైకలాజికల్ చిత్రం. డిఫరెంట్ సబ్జెక్ట్తో డైరెక్టర్ అంజి రామ్ చక్కగా తెరకెక్కించారు. కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ సహా నటీనటులు, టెక్నీషియన్స్ చక్కటి సహకారాన్ని అందించటంతో అనుకున్న ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్నుఅనౌన్స్ చేస్తాం’ అన్నారు.