కోల్కతా: బెంగాల్లో ఇన్నాళ్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీకి మద్దతుగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు ఇక పూర్తిగా ఖతం అయిపోతుందని ముర్షిదాబాద్ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అన్నారు. సీఎం మమతా బెనర్జీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలోని బెల్దంగాలో బాబ్రీ మసీదు ప్రతిరూపానికి శంకుస్థాపన చేయడంతో హుమాయున్ కబీర్ను టీఎంసీ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అతను ఆదివారం మీడియాతో మాట్లాడుతూ “తృణమూల్ పార్టీ ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా ఖతమైతుంది. బెంగాల్లో బీజేపీని రానివ్వను. మమతా బెనర్జీని మళ్లీ సీఎం కానివ్వను. సినిమా ఇంకా పూర్తి కాలేదు (పిక్చర్అబీ బాకీ హై)” అని అన్నారు. డిసెంబర్ 22న కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పారు.
