పుక్కిలించిన నీళ్లతో కరోనా టెస్ట్

పుక్కిలించిన నీళ్లతో కరోనా టెస్ట్

కరోనా టెస్టుల కోసం ఇప్పటివరకు ముక్కు, గొంతుల్లోంచి స్వాబ్‌ను తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు పుక్కిలించిన నీటితోనే టెస్టు చేయొచ్చంటున్నారు. ఇది కూడా కచ్చితత్వంతో పని చేస్తుందని చెబుతున్నారు. పైగా ముక్కు, గొంతు శాంపిల్స్‌‌‌‌తీయడంలో ఉన్నకొన్నిఇబ్బందులు పుక్కిలించిన నీటి శాంపిళ్లు తీయడంలో ఉండవని అంటున్నారు. ఇండియన్‌ ‌‌‌కౌన్సిల్‌‌‌‌ఫర్‌ ‌‌‌సైంటిఫిక్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ఇటీవల చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది.

ఢిల్లీలోని హాస్పిటల్‌‌‌‌లో..

ఢిల్లీలోని హాస్పిటల్‌‌‌‌లో 50 మంది కరోనా పేషెంట్ల పై ఐసీఎంఆర్‌‌‌‌ ఈ స్టడీ చేసింది. కరోనా సోకిందని కన్ఫమ్‌‌‌‌చేసిన 72 గంటల్లోపు శాంపిల్స్‌‌‌‌తీసుకు న్నారు. ముక్కు, గొంతుల్లో స్వాబ్‌ తీసుకోవడం తో పాటు పుక్కిలించిన నీటినీ సేకరించా రు. ఆర్పీసీటీ ఆర్‌‌‌‌టెస్టు చేశారు. పుక్కిలించిన నీళ్లలో వైరస్‌ ‌‌‌ఉన్నట్టు తేలిందని, కాబట్టి అలా శాంపిల్‌‌‌‌ తీసుకున్నా వైరస్‌‌‌‌ను గుర్తించొచ్చని సైంటిస్టులు చెప్పారు.

మస్తు లాభముంది

పుక్కిలించిన నీళ్లశాంపి ల్స్‌‌‌‌సేకరణలో చాలా వరకు లాభాలున్నాయని సైంటిస్టులు చెప్పారు. స్వాబ్‌ తీసుకోవడానికి ఎక్విప్‌మెంట్‌‌‌ ‌అవసరం ఉండదని, సొంతంగానే జనం పుక్కిలించిన నీటిని తీసుకెళ్లి టెస్టింగ్‌‌‌‌కు ఇవ్వొచ్చని అన్నారు. పైగా టెస్టులకు ఖర్చు, హెల్త్‌‌‌‌వర్కర్లపై  ఒత్తిడి తగ్గుతుందని, పీపీఈ కిట్లవాడకం కూడా తగ్గిపోగ్గిపోతుందని చెప్పారు. స్వాబ్‌శాంపి ల్స్‌‌‌‌కన్నా పుక్కిలింతకే జనం ఇంట్రస్ట్‌‌‌‌చూపిస్తారని కూడా అన్నారు. ఇదే ప్రయోగాన్ని జర్మనీలో కూడా చేశారు. అక్కడ కూడా సక్సెస్‌‌‌ ‌అయ్యారు. 924 శాంపి ల్స్‌‌‌‌టెస్టు చేసి 225 పీపీఈ కిట్లు, వెయ్యి స్వాబ్‌లను సేవ్‌ చేశామని వాళ్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వాబ్‌ తీసుకోవడానికి ట్రైనింగ్‌‌‌‌ పొందిన హెల్త్‌ ‌‌‌సిబ్బంది కావాలి. ఈ టైమ్‌‌‌‌లో సిబ్బంది వైరస్‌‌‌‌బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. పుక్కిలించిన నీళ్ల శాంపిల్స్‌‌‌‌ను సొంతంగా అనుమానితులే తీసి ఇవ్వొచ్చు కాబట్టిఏ ప్రాబ్లమ్‌‌‌‌ ఉండదని సైంటిస్టులు అన్నారు.

క్కిళ్లు కొత్త లక్షణమా?

కరోనా లక్షణాలకు సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్‌‌‌‌లోమూడే మూడు లక్షణాలు గుర్తించగా ఇప్పుడు 11కుచేరాయి. తాజాగా ఇంకోలక్షణమూ సైంటిస్టులు కనుగొన్నారు. కరోనా బారిన పడిన ఓ వ్యక్తిలో ఎక్కిళ్లు ప్రధాన లక్షణంగా గుర్తించామన్నారు. గతఏప్రిల్ నెలలో అమెరికాలోనికుక్ కౌంటీ హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ డాక్టర్లు ఈ విషయం గుర్తించారు. వేరే ఇతరకారణం లేకుండానే ఆ పేషెంట్‌‌‌‌కు 4రోజులపాటు ఎక్కిళ్లు వచ్చాయి. పైగా బరువుకూడా తగ్గిపోయాడు. ఊపిరితిత్తుల్లో ట్యూమర్ ఉండొచ్చనిచెస్ట్ ఎక్స్‌‌‌‌రే తీస్తే కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతోటెస్టు చేయగాపాజిటివ్ అనితేలింది.జూన్‌‌‌‌లోనూ ఇలాంటి కేసునేగుర్తించారు. ఎక్కిళ్లు కరోనా లక్షణమని కచ్చితంగా చెప్పలేమని, ఆహార నాళంపై కరోనా ప్రభావం చూపితేఎక్కిళ్లు వచ్చే చాన్స్ఉందని రీసెర్చర్లు చెప్పారు.