శ్రీనగర్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్పై టెర్రరిస్టులు దాడికి తెగబడిన ఘటన ఆదివారం జమ్మూకాశ్మీర్లో చోటుచేసుకుంది. పుల్వామా జిల్లాలో పొద్దున 7.40 గంటలకు ఈ దాడి జరిగింది. గుర్తు తెలియని టెర్రరిస్టులు సీఆర్పీఎఫ్ బృందం ప్రయాణిస్తున్న కాన్వాయ్పై ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)తో అటాక్ చేశారు.
A low intensity #IED blast occurred at #Pulwama. #One CRPF personnel suffered #injuries in his hands and is stable. Senior officers are on the spot. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) July 5, 2020
దాడి తర్వాత సీఆర్పీఎఫ్ దళాన్ని టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు ఫైరింగ్కు దిగారని సమాచారం. ఈ అటాక్లో ఓ జవాన్కు గాయాలయ్యాయని, అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి సీనియర్ ఆఫీసర్స్ చేరుకున్నారని తెలిపారు.