హిందు మహిళల జోలికొస్తే తాట తీస్తాం

హిందు మహిళల జోలికొస్తే తాట తీస్తాం

హైదరాబాద్: హిందు మహిళల జోలికొస్తే తాట తీస్తామని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. నగరంలోని హైదర్షాకోట్ సన్ సిటీలో షారూఖ్ సల్మాన్‌ అనే వ్యక్తి…  ప్రేమించానంటూ ఓ హిందూ యువతిపై కత్తులతో దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రేమిస్తున్నానంటూ హిందు అమ్మాయిల వెంటపడటం, ఒప్పుకోకుంటే వారిపై  ముస్లిం యువత దాడి చేసి, లవ్ జిహాదీ చేస్తున్నారని అన్నారు. సన్ సిటీలో అమ్మాయిపై దాడి లవ్ జీహాదీనే అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయని, హిందువుల అమ్మాయిలపై దాడులు  ఘటనలు బయటకు రానివి అనేకం ఉన్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హిందు అమ్మాయిల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమలవుతున్నాయని, అదే విధంగా హిందు అమ్మాయిల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ ను కోరారు.  దాడి చేసిన వ్యక్తి షారుఖ్ సల్మాన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేరారు.