శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం 

శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం 

శ్రీశైలం రిజర్వాయర్ ను కెఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సంబంధించిన నలుగురు సభ్యుల బృందం పరిశీలించింది. శ్రీశైలం జలాశయం మరమ్మతులకు గతంలో కూడా ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం పరిశీలన చేయగా, ఇవాళ రెండోసారి డ్యాం భద్రత, నీటి నిల్వలు,క్యాలరి,గేట్ల,రోప్స్ పని తీరు అలానే జలాశయం ముందు భాగంలో ఏర్పడిన పెద్ద గొయ్యి(ప్లాంజ్ ఫుల్)ను పరిశీలించారు.డ్యామ్ మరమ్మతులకు కల్పించాల్సిన బడ్జెట్ ని పూర్తిగా పరిశీలించి ప్రపంచ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వనికి నివేదిక అందజేయనున్నారు.

అనంతరం జలాశయం ముందు భాగంలో ఏర్పడిన పెద్ద గొయ్యి(ప్లాంజ్ ఫుల్)కు అలానే గ్యాలరీ రోడ్డు నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.గతంలో చేసిన పరిశీలనకు జలాశయం వివరాలను డ్యామ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు పరిశీలన అనంతరం డ్యామ్ వ్యూ పాయింట్ వద్ద డ్యామ్ అధికారులతో డ్యాం నిర్వహణకు అవసరమయ్యే నిధుల ప్రణాళిక తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు అధికారులు.