టీమిండియాను ఊరిస్తున్న నెంబర్ వన్ ర్యాంకు

టీమిండియాను ఊరిస్తున్న నెంబర్ వన్ ర్యాంకు

2023లో టీమిండియా విజయ యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే లంకతో జరిగిన వన్డే సిరీస్ను 3-0తో  సొంతం చేసుకున్న రోహిత్ సేన...తాజాగా న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ను కూడా మరో వన్డే మిగిలుండగానే 2-0తో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వన్డేల్లో అగ్రస్థానానికి అడుగు దూరంలో నిలిచింది. 

రాయ్ పూర్లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 113 పాయింట్లు సాధించిన భారత జట్టు..న్యూజిలాండ్‌తో సమంగా నిలిచినా మూడో స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ 113 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 112 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ 106 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో  న్యూజిలాండ్‌తో జనవరి 24న  ఇండోర్లో  జరగనున్న  చివరి వన్డేలోనూ టీమిండియా గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానాన్ని అందుకుంటుంది.