నిమిషం పాటు శ్వాసను బిగబడితే కరోనా లేనట్లే

నిమిషం పాటు శ్వాసను బిగబడితే కరోనా లేనట్లే

యోగా గురువు బాబా రాందేవ్
న్యూఢిల్లీ: ఎవరైతే ఓ నిమిషం పాటు శ్వాసను బిగబట్టి ఉంచగలరో వారికి కరోనా లేనట్లేనని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న కేసులకూ లేని వాటికీ ఈ టెక్నిక్ వర్తిస్తుందన్నారు. ‘కరోనా కోసం స్పెషల్ గా ఓ ప్రాణాయామం ఉంది. దానినే ఉజ్జయి అంటారు. దీంట్లో భాగంగా గొంతు నుంచి గాలిని సంకోచించి, ఆపై శబ్దంతో దానిని పంప్ చేసి.. కొద్దిసేపు హోల్డ్ చేసి ఉంచి క్రమంగా వదిలేయాలి. ఇది కరోనా సెల్ఫ్ టెస్టింగ్ లాంటిదే. దీర్ఘకాలిక రక్తపోటు, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటిస్ ఉన్న వారు 30 సెకన్లపాటు గాలిని బిగబట్టి ఉంచితే సరిపోతుంది. అదే యంగ్ ఏజ్ వారైతే ఒక నిమిషం పాటు శ్వాసను హోల్డ్ చేయాలి. అలా ఉండగలిగితే మీకు రోగ లక్షణాలు ఉన్నా లేకపోయినా కరోనా లేనట్లే. కావాలంటే ప్రజలు తమను తాము పరీక్షించుకోవచ్చు. అలాగే ముక్కు రంధ్రాల ద్వారా ఆవ నూనెను పోస్తే.. శ్వాసకోశంలో ఏదైనా కరోనా వైరస్ ఉన్నా కడుపులోకి ప్రవేశించి అక్కడి ఆమ్లాలలో నాశనం అవుతుంది’ అని రాందేవ్ చెప్పారు.