ఓ యువకుడు గురుద్వార్ లో అపవిత్రంగా ప్రవర్తించాడని అక్కడి సిక్కు మతస్తులు చావబాదారు. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించాడు. ఆగ్రహించిన సిక్కులు అతడిపై దాడి చేశారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం బండాలా గ్రామంలోని గురుద్వారా బాబా బీర్ సింగ్ ప్రాంతంలో 19 ఏళ్ల బక్షీష్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించివేశాడని స్థానికులు ఆరోపించారు.
పారిపోతున్న అతడ్ని పట్టుకుని చేతులు కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన బక్షీష్ సింగ్ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు. తన కుమారుడు మానసిక వికలాంగుడని, రెండేళ్లుగా మందులు వాడుతున్నాడని బక్షీష్ సింగ్ తండ్రి లఖ్వీందర్ సింగ్ పోలీసులకు చెప్పాడు. తన కుమారుడ్ని చంపిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.