హనుమాన్ జయంతి రోజున నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న వారిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ లోని 22 చోట్ల SOT పోలీసులు సోదాలు నిర్వహించారు.
నిందితుల దగ్గర నుంచి రెండు లక్షల ఒక వేయి విలువ చేసే 448 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్న 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు.
మేడ్చల్ లో 6 కేసులు, బాలానగర్ లో , 5 రాజేంద్రనగర్ లో 5 కేసులు, మాదాపూర్ లో 4, శంషాబాద్ 2 కేసులు నమోదు చేశారు ఎస్వోటీ పోలీసులు