నా షాట్లన్నీ ఆడేందుకు ట్రై చేస్తున్నా: యశస్వి జైస్వాల్‌‌‌‌

నా షాట్లన్నీ ఆడేందుకు ట్రై చేస్తున్నా: యశస్వి  జైస్వాల్‌‌‌‌

తిరువనంతపురం: ప్రతి మ్యాచ్‌‌‌‌లో భయం లేకుండా అన్ని షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నానని టీమిండియా యంగ్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌ అన్నాడు. ప్రతి విషయాన్ని వేగంగా నేర్చుకుంటున్నానని చెప్పాడు. ‘ప్రతి మ్యాచ్‌‌‌‌ నాకు ప్రత్యేకమే. భయం లేకుండా బౌలర్లపై ఎదురుదాడి చేసేందుకు ట్రై చేస్తున్నా. ఈ క్రమంలో అన్ని షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నా. నా నిర్ణయాలపై చాలా సంతృప్తిగా ఉన్నా. కోచ్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌ సర్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ సూర్య నాకు చాలా మద్దతిస్తున్నారు. 

వాళ్ల ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌తో నా ఆటను మరింత మెరుగుపర్చుకుంటున్నా. ప్రతి రోజూ ఏదో ఓ కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా’ అని జైస్వాల్‌‌‌‌ పేర్కొన్నాడు. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌తో పాటు మానసికంగా మరింత ధృడంగా తయారయ్యేందుకు శ్రమిస్తున్నానని తెలిపాడు. తొలి టీ20లో రుతురాజ్‌‌‌‌ను రనౌట్‌‌‌‌ చేయడంలో తన తప్పిదమే ఎక్కువగా ఉందన్నాడు. తాను అనవసరంగా పిలిచానని, మ్యాచ్‌‌‌‌ తర్వాత ఇదే విషయంపై సారీ కూడా చెప్పానని యశస్వి వెల్లడించాడు. ఫినిషర్‌‌‌‌గా రింకూ సింగ్‌‌‌‌ చాలా ప్రభావం చూపిస్తున్నాడని ప్రశంసించాడు.