నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో 11వ నర్సరీ మేళా గురువారం గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నర్సరీల నిర్వాహకులు, మొక్కల వ్యాపారులు వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. పూలు, పండ్లు, ఎయిర్ ప్యూరిఫైంగ్ ప్లాంట్స్, బొన్సాయ్, డెకరేషన్, మెడిసినల్ ప్లాంట్స్ ఇలా బోలెడు వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. నర్సరీకి సిటీ ప్రజల క్యూ కట్టారు. తమకు నచ్చిన మొక్కలను తెచ్చుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని, ఎంట్రీ ఫీజు రూ.20లుగా ఉందని స్టాల్ నిర్వాహకుడు ఖలీద్ తెలిపారు. ఈ మేళా ఫిబ్రవరి 28 వరకు కొనసాగునున్నట్లు ఆయన చెప్పారు.
For More News..