
ప్రస్తుతం ఓటీటీలో హారర్, థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. ఆడియన్స్ కి కూడా సాఫ్ట్, ఎమోషనల్, ఎంటర్టైనింగ్ సినిమాలను చూడటానికి ఇష్టపడటంలేదు. క్షణ క్షణం ఉత్కంఠభరితంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉండే సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే.. ఓటీటీ సంస్థలు కూడా అలాంటి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అలా ఈవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది బాడీ.
బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హస్మి, సౌత్ బ్యూటీ శోభితా దూళిపాళ్ల జంటగా వచ్చిన ఈ సినిమాను దృశ్యం సినిమాల దర్శకుడు జీతూ జోషఫ్ తెరకెక్కించాడు. ప్రముఖ హాలీవుడ్ మూవీ ది బాడీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ కీ రోల్ చేశారు. ఆద్యంతం థ్రిల్ కలిగించే విధంగా వచ్చిన ఈ రొమాంటిక్ క్రైమ్ అండ్ మర్డర్ మిస్టరీ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేయడం ఖాయం. ఊహించని ట్విస్టులు, మలుపులు తిరిగే స్క్రీన్ ప్లేతో ఫుల్లుగా థ్రిల్ చేస్తోంది ఈ సినిమా. కేవలం గంటా నలభై నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా.. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది ఈ మూవీ.
ఇక ది బాడీ కథ విషయానికి వస్తే.. ఇండియాస్ ప్రముఖ వ్యాపారవేత్త మాయ వర్మ, ఆమె భర్త అజయ్ పూరి (ఇమ్రాన్ హష్మీ). ఒకరోజు వర్మ హఠాత్తుగా చనిపోతుంది. పోస్ట్మార్టం కాకముందే ఆమె బాడీ మాయమైపోతుంది. దీంతో ఆమె భర్త అజయ్ పూరి కంగారు పడుతాడు. ఈ కేసుని సాల్వ్ చేసేందుకు ఎస్పీ జైరాజ్ రావల్ (రిషి కపూర్) రంగంలోకి దిగుతాడు. మరి వర్మ బాడీ ఏమైంది? నిజంగానే ఆమె చనిపోయిందా? లేక ఎవరైనా చంపేశారా? అనేది ది బాడీ కథ.