న్యూఢిల్లీ : డిజిటల్ టెక్ కంపెనీ గోఆప్టివ్ ప్రైవేట్ లిమిటెడ్లో అదనంగా రూ. 42 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఫార్మా సంస్థ సిప్లా శుక్రవారం వెల్లడించింది. దీంతో గోఆప్టివ్లో తమ మొత్తం వాటా 22.99 శాతానికి పెరుగుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గోఆప్టీవ్లో సిప్లాకు ఇది మూడవ పెట్టుబడి. ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్ల కలయికతో వాటాను కొన్నది. ఈ భాగస్వామ్యం వల్ల భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో చొచ్చుకుపోవడానికి తమకు వీలవుతుందని సిప్లా గ్లోబల్ సీఈఓ ఉమంగ్ వోహ్రా తెలిపారు.