- తగ్గిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్
- సిటీలో 68.3% క్యాష్ పేమెంట్స్
- ఆన్ లైన్ ఆర్డర్స్కి కూడా క్యాష్ ఆన్ డెలివరీనే..
- ఎటీఎం సెంటర్ల దగ్గర పెరుగుతున్న రద్దీ
- మెట్రో సిటీల్లో రేజర్ పే సర్వే
హైదరాబాద్, వెలుగు: కరోనాకి ముందు సిటీలో ఏం కొనాలన్నా, ఏ బిల్లు కట్టాలన్నా కార్డ్, ఆన్లైన్ పేమెంట్ కంటే క్యాష్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్లు. వైరస్ ఎఫెక్ట్, లాక్ డౌన్తో దాదాపు అంతా ఆన్లైన్ పేమెంట్స్ మొదలుపెట్టారు. అన్లాక్తో ఈ పరిస్థితి మళ్లీ మారుతున్నట్లు చెప్తోంది రేజర్పే ఆన్లైన్ పేమెంట్స్ సింప్లిఫైడ్ కంపెనీ. అన్ లాక్ మొదలయినప్పటి నుంచి బిల్ పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ మెథడ్పై ఈ సంస్థ మూడు మెట్రో పాలిటిన్ సిటీల్లో సర్వే చేసింది. ప్రీ లాక్ డౌన్కి ముందులాగే ఎక్కువమంది క్యాష్ పేమెంట్స్ చేస్తున్నట్లు అందులో తేలింది. ఢిల్లీ మొదటి స్థానంలో, హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
లాక్ డౌన్లో ఇలా..
మార్చిలో లాక్ డౌన్ మొదలైంది. కరోనా కేసులు రోజురోజుకి పెరగడంతో జనం గ్రాసరీ నుంచి షాపింగ్ వరకు ఏదీ కావాలన్నా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నారు. పేమెంట్స్ కూడా క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా డిజిటల్గా చేశారు. బయటకు వెళ్లినా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ కే మొగ్గు చూపారు. దాంతో మాములు రోజులతో చూస్తే లాక్ డౌన్లో ఆన్లైన్ పేమెంట్స్ 5 శాతం పెరిగినట్లు ఫినో ఆన్లైన్ పేమెంట్స్ కంపెనీ పేర్కొంది. 180 నుంచి 190శాతం పెరిగినట్లు రేజర్ పే తెలిపింది.
మళ్లీ మాములు స్థితికి..
అన్ లాక్ 4తో సిటీ మాములు స్థితికి చేరుకుం టోంది. దాదాపు అన్ని యాక్టివిటీస్ మొదలయ్యాయి. జనం కూడా పెద్దసంఖ్యలో బయటకు వస్తున్నారు. లాక్ డౌన్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరగడంతో అన్ లాక్లో పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఇటీవల రేజర్ పే సంస్థ ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్లో సర్వే చేసింది. ఢిల్లీలో 72.4శాతం, హైదరాబాద్ లో 68.3శాతం, ముంబయిలో 58.5శాతం మంది పేమెంట్స్కి క్యాష్నే ప్రిఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. దాంతో ఏటీఎం సెంటర్లు, క్యాష్ విత్ డ్రా పాయింట్స్ వద్ద రద్దీ పెరిగినట్లు తెలిపింది.
ఆర్డర్స్ డిలే అవుతుండటంతో..
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రొడక్ట్స్కి కరోనా ఎఫెక్ట్తో లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఈ -కామర్స్ సైట్స్ ద్వారా ఆర్డర్స్ చేస్తే ఎప్పుడు డెలివరీ అవుతాయో కచ్చితంగా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ డెలివరీ లేట్అవడం, ప్రొడక్ట్స్ స్టాక్ లేకపోవడంతో ఈ -కామర్స్ పోర్టల్స్పై ప్రీ పెయిడ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు సిటిజన్స్ ఇంట్రెస్ట్ చూపించ లేదు. కస్టమర్లు డిజిటల్గా పే చేయకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. క్యాష్ పేమెంట్స్ పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ గా రేజర్ పే పేర్కొంది.
ప్రీపెయిడ్ ఆర్డర్స్ తగ్గినయ్
కరోనా కారణంగా సప్లయ్ చైన్ దెబ్బతినడంతో ఈ -కామర్స్ పోర్టల్ పై ప్రీపెయిడ్ ఆర్డర్లు చేయడానికి కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఈ -కామర్స్ వాల్యూమ్స్ తగ్గడానికి ముఖ్య కారణం లాజిస్టికల్ ప్రాబ్లమ్స్. దాని వల్ల ఇన్టైమ్లో ప్రొడక్ట్ డెలివరీ అవుతుందో, లేదో తెలియని పరిస్థితి. లాక్ డౌన్ మొదట్లో ప్రీపెయిడ్ ఆర్డర్స్ పెరిగినా, డెలివరీ ఆలస్యం అవుతుండడంతో కస్టమర్లు క్యాష్ ఆన్ డెలివరీ చేసుకుంటున్నారు.
‑ హర్షిల్ మాథుర్, రేజర్పే సీఈఓ