అమ్మకానికి బిస్లరీ.. టాటా గ్రూప్‌తో చర్చలు.!

అమ్మకానికి  బిస్లరీ.. టాటా గ్రూప్‌తో చర్చలు.!

ప్యాకేజ్డ్‌ వాటర్‌ వ్యాపార సంస్థ బిస్లరీని అమ్మనున్నట్లుగా ఆ కంపెనీ ఛైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌ వెల్లడించారు. కొనుగోలుదారుల కోసం వెతుకుతున్నట్లుగా తెలిపారు. అందులో భాగంగా టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ సహా మరికొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లుగా ఆయన చెప్పారు. అయితే టాటా గ్రూప్ తో రూ. 7 వేల కోట్లకు డీల్ ఓకే  అయిందని వస్తోన్న వార్తలను రమేశ్‌ చౌహాన్‌  ఖండించారు.  ఇక బిస్లరీ అమ్మకానికి గల కారణాలను రమేశ్‌ చౌహాన్‌ తెలిపారు. 

వ్యాపర నిర్వహణపై తన కుమార్తె జయంతి అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా  వెల్లడించారు.  జయంతి  ప్రస్తుతం  ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీగా బిస్లరీకి పేరు ఉంది. కేవలం కేవలం రూ.4 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన బిస్లరీ.. ఇప్పుడు రూ.7000 కోట్లకు విస్తరించింది. దీని  వెనుక రమేశ్‌ చౌహాన్‌ కృషి ఎంతగానో ఉందన్నారు.  బిస్లరీ ఇంటర్నేషనల్‌ కింద బిస్లరీ మినరల్‌ వాటర్‌తో పాటు హిమాలయన్‌ స్ప్రింగ్‌ వాటర్‌, ఫ్రీజ్‌ డ్రింక్‌, హ్యాండ్‌ ప్యూరిఫయర్‌ ఉత్పత్తులు కూడా ఉన్నాయి.