చిరుత భయంతో మేకలను అమ్మేసిన గొర్ల కాపరి 

చిరుత భయంతో మేకలను అమ్మేసిన గొర్ల కాపరి 

బాబోయ్ చిరుత..ఈ పేరు వింటే చాలు అక్కడి ప్రజలకు వెన్నులో వణుకు పుడుతోంది.ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. దీని భయానికి ఓ గొర్ల కాపరి 27 మేకలను అమ్మేశాడంటే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రాంతంలో చిరుత  మేకలను ఎలా వేటాడేస్తుందో. 

చిరుతను పట్టుకోవాలని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. దాన్ని ఎలాగైనా పట్టుకునేందుకు అన్వేషణ ప్రారంభించారు. చిరుత పాదాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని..ప్రజలు ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు.