చంద్రబాబు సభలో తొక్కిసలాట..8 మంది మృతి

చంద్రబాబు సభలో తొక్కిసలాట..8 మంది మృతి
  • మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని బాబు  ప్రకటన

నెల్లూరు : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది చనిపోయారు. నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. చంద్రబాబు సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. దీంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు రోడ్డు పక్కనున్న డ్రైనేజీ కాల్వలో పడిపోయారు. వెంటనే టీడీపీ లీడర్లు, మిగతా కార్యకర్తలు అప్రమత్తమై గాయపడిన వారిని కందుకూరు ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ 8 మంది చనిపోయారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. దీంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తర్వాత బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్లి మాట్లాడారు. తొక్కిసలాట ఘటన తనను ఎంతో కలచివేసిందని, ఈ ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరపున రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.