బావ ని బండరాయితో కొట్టి చంపిండు

బావ ని బండరాయితో కొట్టి చంపిండు
  •   సోదరితో గొడవ పెట్టుకుండని బావమరిది ఘాతుకం

అల్వాల్ వెలుగు: కుటుంబ గొడవల కారణం గా ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన అల్వాల్ లో స్థానికంగా సంచలనం సృష్టించింది.  అల్వాల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. భారతీనగర్ లోని ఉండే యోగేందర్ (40), జానకి పాత నేరస్తులు. ఆమెకు యోగేందర్  రెండో భర్త..కాగా.. మొదటిభర్త ద్వారా 16 ఏండ్ల కూతురు ఉంది. సోమవారం అర్ధరాత్రి అతిగా మద్యం తాగిన యోగేందర్.. భార్య, కూతురితో గొడవపడ్డాడు. దీంతో జానకి బొల్లారంలో ఉండే తన సోదరుడు సుబ్రమణ్యంకు ఫోన్ చేసి చెప్పింది.

ఆగ్రహంతో సోదరి ఇంటికి వచ్చిన సుబ్రమణ్యం వెంటనే బావ యోగేందర్ ను బండరాయితో కొట్టడడంతో తీవ్రంగా గాయపడిన స్పాట్ లోనే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి  జానకిని అదుపులోకి తీసుకోగా ఆమె సోదరుడు సుబ్రమణ్యం పరార్ అయ్యాడు. డెడ్ బాడీని  పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంతకుముందే వీరికి కుటుంబ గొడవలు ఉన్నట్టు ..ఇటీవలే జానకి,  యోగేందర్  జైలు నుంచి విడుదల అయ్యారని,  వీరిపై పాత కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.