భద్రాచలం, వెలుగు: కరవు కాలంలో గిరిజనులకు తీపికబురు. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు ధరలు పెంచుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ డా.క్రిష్టినా జెడ్ చోంగ్తు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచే ధరలను అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గిరిజనుల నుంచి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కొనుగోలు చేసే ఈ ఉత్పత్తులకు కొత్త ధరలను ఇవ్వాలని ఆదేశించారు.
వివిధ ఉత్పత్తులకు గిరిజనులకు చెల్లిస్తున్న ధర కిలోకు రూ.లలో..
ఉత్పత్తి – పాత ధర – కొత్త ధర
తేనె -195 – 225
ఇప్ప పువ్వు – 17 – 30
జిగురు – 108 -114
ఇప్ప బద్ద -25 – 29
ఉసిరి -45 -52
నల్లజీడిగింజలు -9 -12
కుంకుడుకాయలు -8 -14