సెప్టెంబర్ 17వ తేదీపై తెలంగాణలో దాదాపు 70 ఏళ్లుగా వివాదం నలుగుతోంది . నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన రోజు కాబట్టి ‘విమోచన దినోత్సవం’ జరపాలంటారు కొందరు. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలిపేసిన రోజు కాబట్టి ‘విలీన దినోత్సవం’ జరపాలంటారు మరికొందరు. దేశానికి 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ లభించగా, హైదరాబాద్ సంస్థానానికి ఏడాది తర్వాత విముక్తి లభించిందన్న చారిత్రక వాస్తవంపై ఎలాంటి గొడవా లేదు.
ఈ విముక్తి పోరాటంలో పాల్గొన్న ప్రజలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలను స్మరించుకోవడం తప్పనిసరి. ఏదైనా కానీ తెలంగాణ గడ్డకు స్వేచ్ఛ వచ్చిన రోజు ఇది.