![IND vs NZ : తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా](https://static.v6velugu.com/uploads/2023/01/rohit_7KLQiynEVk.jpg)
ఉప్పల్ గ్రౌండ్ లో కివీస్ తో జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ( 34) పరుగుల వద్ద ఔటయ్యాడు. 12వ ఓవర్ లో బ్లెయిర్ టిక్నెర్ వేసిన మొదటి బంతికి రోహిత్ డారిల్ మిచెల్కి చిక్కాడు. దీంతో 60 పరుగుల వద్ద టీమిండియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. అంతకుముందు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ తో కలిసి రోహిత్ జట్టకు మంచి శుభారంభాన్ని అందించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(1), శుభ్ మన్ గిల్(23) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డేవన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రాస్వెల్, హెన్రీ షిప్లే, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నెర్