ఇండియా ఒక ప్రయోగశాల ... జీ20 మీటింగ్​లో ప్రధాని మోదీ

ఇండియా ఒక ప్రయోగశాల ... జీ20 మీటింగ్​లో ప్రధాని మోదీ

బెంగళూర్: వివిధ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు మనదేశం ఒక ఆదర్శవంతమైన ప్రయోగశాల అని ప్రధాని మోదీ అన్నారు. జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మినిస్టర్స్ మీటింగ్ శనివారం బెంగళూర్ లో జరిగింది. ఇందులో మోదీ వర్చువల్​గా మాట్లాడారు. ‘‘ఇండియా చాలా వైవిధ్యమైన దేశం. ఇక్కడ ఎన్నో భాషలు, మాండలికాలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని మతాలకు, సాంస్కృతిక పద్ధతులకు నిలయం. పురాతన సంప్రదాయాల నుంచి ఆధునిక టెక్నాలజీ వరకు భారత్ ఎంతో ప్రత్యేకమైనది. అందుకే పరిష్కారాలను కనుగొనేందుకు ఒక ఆదర్శవంతమైన ప్రయోగశాల. అంతేకాకుండా ఇక్కడ కనుగొన్న పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈజీగా అమలు చేయొచ్చు” అని ఆయన అన్నారు. ‘‘డిజిటల్ ఎకానమీ రంగంలో మేం ఎన్నో ప్రయోగాలు చేశాం. జన్ ధన్ అకౌంట్లు, ఆధార్ కార్డులు, మొబైల్ ఫోన్లతో ఆర్థిక లావాదేవీల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. మా అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు.