మార్కెట్‌లోకి కరోనా టెస్టింగ్ కిట్.. ధర రూ.250 మాత్రమే

మార్కెట్‌లోకి కరోనా టెస్టింగ్ కిట్.. ధర రూ.250 మాత్రమే

న్యూఢిల్లీ: కరోనా టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్ లకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టింగ్ కిట్ ను ప్రజలకు అందుబాటు ధరలో మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ (RAT) ధరను రూ.250గా నిర్ణయించింది. ఈ కిట్ తో 15 నిమిషాల్లో కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చు. పూణేకు చెందిన మై ల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన ఈ కిట్ ను.. కరోనా లక్షణాలు ఉన్న వారు, కరోనా పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారు టెస్టింగ్ కోసం వినియోగించొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. మరో వారం రోజుల్లో ఈ కిట్స్ అందుబాటులోకి రానున్నాయి.