12.50 లక్షల మంది ప్రేక్షకులతో వరల్డ్ కప్ ఆల్ టైమ్ రికార్డ్

12.50 లక్షల మంది ప్రేక్షకులతో వరల్డ్ కప్ ఆల్ టైమ్ రికార్డ్

న్యూఢిల్లీ: ఇండియా ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్‌‌‌‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌‌‌‌లను ఏకంగా 12 లక్షల 50 వేల మంది స్టేడియాల్లో చూశారు. దాంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యం ఇచ్చిన 2015 వన్డే వరల్డ్ కప్‌‌‌‌కు హాజరైన  ప్రేక్షకుల రికార్డును ఈ టోర్నీ బ్రేక్ చేసింది. 

2015 టోర్నీకి 10.16 లక్షల మంది హాజరవగా, ఇంగ్లండ్‌‌‌‌లో జరిగిన 2019 వరల్డ్ కప్‌‌‌‌లో 7.52 లక్షల మంది ప్రేక్షకులు స్టేడియాలకు వచ్చారు.