దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2 వేల 527 కేసులొచ్చాయి. 33 మంది కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు పెరగగా... మరణాలు తగ్గాయి. యాక్టివ్ కేసులు 15 వేల 79కి పెరిగాయి. గత 24 గంటల్లో 1,656 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోలుకున్న వారికంటే.. కొత్త కేసులు అధికంగా వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 0.56 శాతానికి పెరిగింది .ఇప్పటివరకు 187 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది కేంద్రం.

మరిన్ని వార్తల కోసం

మలేరియా కట్టడిలో రాష్ట్రానికి జాతీయ గుర్తింపు

ఐకేపీ సెంటర్ల దగ్గర అరిగోస పడుతున్న రైతులు