కోలుకోలేని దెబ్బ… రోహిత్, కోహ్లీ, రాహుల్ వెంటవెంటనే ఔట్

కోలుకోలేని దెబ్బ… రోహిత్, కోహ్లీ, రాహుల్ వెంటవెంటనే ఔట్

వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ఆరంభంలోనే టీమిండియాకు షాక్ మీద షాక్ తగిలింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. స్కోరుబోర్డుపై 4/1, 5/2, 5/3 ఇలా… 5 రన్స్ కే 3 అత్యంత కీలకమైన వికెట్లు కోల్పోయింది.

స్టార్ బ్యాట్స్ మన్, టోర్నీలో టాప్ స్కోరర్ రోహిత్ శర్మ ఒక రన్ కే ఔటయ్యాడు. 4 బాల్స్ లో ఒక రన్ చేసిన రోహిత్ శర్మ.. హెన్రీ బౌలింగ్ లో కీపర్ లాథమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

6బాల్స్ లో 1 రన్ చేసిన విరాట్ కోహ్లీ బౌల్ట్ బౌలింగ్ లో ఎల్బీగా ఔటయ్యాడు.

ఆ తర్వాత ఓవర్లో హెన్రీ మరోసారి ఇండియాను దెబ్బతీశాడు. 7 బాల్స్ లో 1 రన్ చేసిన కేఎల్ రాహుల్ హెన్రీ బౌలింగ్ లో కీపర్ లాథమ్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.