
కౌలాలంపూర్: జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్లో ఇండియాకు చుక్కెదురైంది. 12 పెనాల్టీ కార్నర్లలో ఒక్కదాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయిన ఇండియన్స్ గురువారం జరిగిన సెమీఫైనల్లో 1–4తో బలమైన జర్మనీ చేతిలో ఓడిపోయారు. మ్యాచ్ మొత్తంలో రెండే పెనాల్టీ కార్నర్లు సాధించిన జర్మనీ రెండింటికి గోల్స్ చేసింది.
ఇండియా టీమ్లో 11వ నిమిషంలో సుదీప్ చిర్మాకో ఏకైక గోల్ చేయగా.. ప్రత్యర్థి జట్టులో బెన్ హస్బాచ్ (8వ ని, 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టాడు. గ్లాండర్ పాల్ (41 వ. ని), ఫ్లోరియన్ స్పెర్లింగ్ (58వ ని) ఒక్కో గోల్తో తమ జట్టును గెలిపించారు. ఫైనల్ చేరలేకపోయిన ఇండియా శనివారం బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడనుంది.