మౌంట్ మాంగనీ: ఇండియా–న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్లో తొలి టీ20 వాన వల్ల టాస్ కూడా పడకుండానే రద్దవడంతో మూడు మ్యాచ్ల సిరీస్ కాస్త రెండు టీ20 పోరుగా మారింది. వేదిక మౌంట్ మంగనీకి మారినా పరిస్థితి మారేలా లేదు. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే రెండో టీ20కి కూడా వాన ముప్పు పొంచి ఉంది.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ఇండియా పలువురు యంగ్స్టర్స్ను పరీక్షించాలని చూస్తోంది. అదే సమయంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన సత్తాచాటుకొని ఈ ఫార్మాట్లో జట్టులో చోటు నిలుపుకోవాలని చూస్తున్నాడు.