
కౌలాలంపూర్: మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్లో ఇండియా సూపర్ పెర్ఫామెన్స్తో సెమీఫైనల్ చేరుకుంది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియా 4–3తో నెదర్లాండ్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. ఓ దశలో 0–2తో వెనుకంజ వేసిన జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఐదో నిమిషంలో బోయెర్స్, 16వ నిమిషంలో పెపిన్ చేసిన గోల్స్తో డచ్ టీమ్ హాఫ్ టైమ్కు 2–0తో ముందంజ వేసింది.
అయితే, ఆదిత్య (34 వ. ని), అరైజీత్ (36వ ని.) చెరో గోల్తో స్కోరు 2–2తో సమం చేశారు. మూడో క్వార్టర్ ముగుస్తుండగా ఒలివియెర్ చేసిన గోల్తో నెదర్లాండ్స్ 3–1తో ఆధిక్యంలో నిలిచింది. కానీ, చివరి పది నిమిషాల్లో ఇండియన్స్ జోరు పెంచారు. 52వ నిమిషంలో సౌరభ్ ఫీల్డ్ గోల్తో స్కోరు సమం చేయగా.. 57వ నిమిషంలో కెప్టెన్ ఉత్తమ్ సింగ్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి ఇండియాను గెలిపించాడు. గురువారం జరిగే సెమీస్లో జర్మనీతో ఇండియా పోటీ పడనుంది.