దేశంలో తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు

దేశంలో తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు

భారత్ లో కరోనా కేసులు కొన్ని రోజులుగా తగ్గుతున్నాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతుండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,09,918  పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి ఒక్కరోజే 959 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,62,628 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా18,31,268 పాజిటివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు భారత్ లో 1,66,03,96,227 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.