భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.పలు రాష్ట్రాల్లో వంద లోపే కేసులు నమోదు అవుతున్నాయి, తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 6561 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా కారణంగా 142 మంది మృతి చెందారు. ఇక కరోనా బారిన పడి 14,947 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 77,152 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. అర్హులైన వారందరికీ కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక టీనేజర్లకు కూడా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటివరకు రెండు కోట్లకు పైగా టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. 

ఇవి కూడా చదవండి:

క్రికెట్‌‌ ఫ్యాన్స్​కు గుడ్‌‌ న్యూస్‌‌

8వ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం