భారత్, లంక సిరీస్‌ రీషెడ్యూల్.. 18 నుంచి మొదలు

భారత్, లంక సిరీస్‌ రీషెడ్యూల్.. 18 నుంచి మొదలు

ముంబై: భారత్, శ్రీలంక మధ్య వచ్చే మంగళవారం (13వ తేదీ) నుంచి మొదలవ్వాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ కన్ఫర్మ్ చేసింది. పాత షెడ్యూల్ ప్రకారం ఈనెల 13 నుంచి 25 తేదీల మధ్య ఈ సిరీస్ జరగాల్సింది. కానీ రీషెడ్యూల్ చేయడంతో 18వ తేదీ నుంచి 29వ తేదీల మధ్య వన్డేలు జరగనున్నాయి. ఇంగ్లండ్‌‌ టూర్‌‌ పూర్తి చేసుకుని స్వదేశానికి వచ్చిన తమ జట్టులో కరోనా కలకలం రేగడంతో భారత్‌తో వన్డే సిరీస్‌ను రీషెడ్యూల్ చేయాలని లంక నిర్ణయించింది. లంక బ్యాటింగ్‌‌ కోచ్‌‌ గ్రాంట్‌‌ ఫ్లవర్‌‌, ఎనలిస్ట్‌‌ నిరోషన్‌‌ కరోనా పాజిటివ్‌‌గా తేలారు. దీంతో జట్టు మొత్తాన్ని ఐసోలేషన్‌‌కు తరలించారు. ఈ కారణంగానే కొంత ఆలస్యంగా సిరీస్‌‌ స్టార్ట్‌‌ చేయాలని లంక బోర్డు యోచిస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి ప్రతిపాదనలు పంపగా అటు నుంచి సానుకూల నిర్ణయం వచ్చింది. ఈ సిరీస్ జూలై 18 నుంచి ప్రారంభం అవుతుందని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశాడు.