న్యూఢిల్లీ: మనదేశంలో టెలికాం సబ్స్క్రయిబర్ల సంఖ్య అంతకు ముందు నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో 0.38 శాతం పెరిగి 119.7 కోట్లకు చేరుకుందని ట్రాయ్ తెలిపింది. పట్టణ టెలిఫోన్ సబ్స్క్రిప్షన్ 66.37 కోట్లకు పెరగగా, గ్రామీణ సబ్స్క్రిప్షన్ వరుసగా 0.40 శాతం 0.34 శాతం వృద్ధి రేటుతో 53.13 కోట్లకు పెరిగింది.
మొత్తం బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రయిబర్లు జనవరి చివరి నాటికి 91.10 కోట్ల నుంచి ఫిబ్రవరి చివరి నాటికి 91.67 కోట్లకు పెరిగారు. మొత్తం బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రయిబర్లలో 98.35 శాతం మంది టాప్–5 సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర ఉన్నారు.