రేపే అఫ్గానిస్తాన్ తో భారత్ ఢీ

రేపే అఫ్గానిస్తాన్ తో భారత్ ఢీ

పాకిస్థాన్ పై విజయంతో జోరు మీదున్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. రేపు సౌతాంప్టన్ వేదికగా అఫ్గానిస్తాన్ తో భారత్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం నాలుగోస్థానంలో కొనసాగుతుండగా..అఫ్గాన్ చివరిస్థానంలొ కొనసాగుతోంది.  మరోవైపు భారత జట్టును గాయాలు వేధిస్తున్నాయి.  గాయం కారణంగా  ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పటికే టోర్నీ మెత్తానికి దూరం కాగా..భువనేశ్వర్ సైతం గాయపడి కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. తాజాగా ఆ లిస్ట్ లో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కూడా చేరాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టిన విజయ్ శంకర్…రేపటి మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడో లేదో అన్నదానిపై అనుమానాలు నెలకొన్నాయి. గాయపడిన భువనేశ్వర్ స్థానంలో షమీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.