బంగ్లాను కట్టడి చేస్తున్న భారత బౌలర్లు

బంగ్లాను కట్టడి చేస్తున్న భారత బౌలర్లు

భారత్, బంగ్లా మధ్య జరుగుతోన్న  రెండో టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్ ఓవర్ నైట్ స్కోర్ 7 పరుగులతో ఇవాళ ఇన్నింగ్స్  స్టార్ట్ చేసిన బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్లు బంగ్లా బ్యాట్స్ మెన్ ను వెనువెంటనే పెవిలియన్ చేర్చారు.  బంగ్లా ఓపెనర్  నజ్ముల్ హోసన్ శాంతో 5, .మెమినుల్ హక్ 5, షకీబ్ అల్ హసన్ 13, ముష్పికర్ రహీమ్ 9 కే ఔటయ్యారు.    మరో ఓపెనర్  జకీర్   హాసన్ 37 పరుగులు, లిటన్ దాస్ తో  క్రీజులో ఉన్నారు.దీంతో బంగ్లా 33 ఓవర్లు  ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 71పరుగులు చేసింది. ఇంకా 16 పరుగుల  వెనుకంజలో ఉంది. 

అంతకుమందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో  314 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంత్ 93, శ్రేయాస్ అయ్యార్ 87 పరుగులతో అదరగొట్టారు.