బంగ్లాదేశ్‌పై ఇండియా రెండో విజయం

బంగ్లాదేశ్‌పై ఇండియా రెండో విజయం

సిల్హెట్‌‌‌‌: బంగ్లాదేశ్‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో ఇండియా విమెన్స్‌‌‌‌ రెండో విజయం సాధించింది. రాధా యాదవ్ (3/19), హేమలత (24 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 నాటౌట్‌‌‌‌) సత్తా చాటడంతో మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌‌‌‌లో డక్‌‌‌‌వర్త్ లూయిస్‌‌‌‌ పద్ధతిలో 19 రన్స్‌‌‌‌ తేడాతో బంగ్లాను ఓడించింది. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 2–0తో ఆధిక్యం సాధించింది. టాస్‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన బంగ్లా  20 ఓవర్లలో 119 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది.

ముర్షిదా ఖాటున్ (46) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఛేజింగ్‌‌‌‌లో  ఇండియా 5.2 ఓవర్లలో 47/1 తో నిలిచిన దశలో వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. డక్‌‌‌‌వర్త్ ప్రకారం అప్పటికి టార్గెట్‌‌‌‌ను 29 రన్స్‌‌‌‌గా లెక్కగట్టగా ఇండియానే  గెలిచింది.   హేమలతకు ప్లేయర్ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది. మూడో టీ20 గురువారం జరుగుతుంది.