అశ్విన్, జయంత్ దెబ్బకు కివీస్ చిత్తు

అశ్విన్, జయంత్ దెబ్బకు కివీస్ చిత్తు

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విక్టరీ కొట్టింది. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ లు చెలరేగడంతో టీమిండియా 372 పరుగుల భారీ తేడాతో   విజయం సాధించింది. తద్వారా రెండు టెస్టుల సిరీస్ ను కైవసం చేసుకుంది. 540 పరుగుల కఠినమైన లక్ష్య ఛేదనలో నాలుగో రోజు 140/5 వికెట్లతో బ్యాటింగ్ మొదలుపెట్టిన కివీస్ ను జయంత్ యాదవ్ ముప్పుతిప్పలు పెట్టాడు. అద్భుతమైన ఆఫ్ స్పిన్ డెలివరీలతో మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ కు పంపాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన జయంత్ భారత్ ను విజయానికి దగ్గర చేశాడు. నాలుగో రోజు 5 వికెట్లు పడితే అందులో అందులో జయంత్ 4 వికెట్లు తీయడం విశేషం. మరో ఎండ్ లో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం భారత్ కు కలిసొచ్చింది. చివరి నాలుగు వికెట్లను జయంత్ తీయగా.. లాస్ట్ బ్యాట్స్ మన్ ను అశ్విన్ వెనక్కి పంపాడు. చివరి 5 వికెట్లను 27 రన్స్ తేడాతో కోల్పోయిన న్యూజిలాండ్ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.