వాయుసేనకు మరో 5 తేజస్ జెట్లు

వాయుసేనకు  మరో 5 తేజస్ జెట్లు

న్యూఢిల్లీ: భారత వాయుసేనకు మరో 5 తేజస్ ఫైటర్ జెట్​లు సమకూరనున్నాయి. వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్​కు డెలివరీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) గురువారం వెల్లడించింది. వీటితోపాటు మరో 9 తేజస్ ఫైటర్ జెట్​లను కూడా సిద్ధం చేశామని, కానీ వాటిలో అమర్చాల్సి ఉన్న ఇంజన్​లు అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది. ఆ ఇంజన్లు రాగానే ఈ 9 జెట్ లను కూడా డెలివరీ చేస్తామని పేర్కొంది.

కాగా, వాయుసేనకు మొత్తం 83 తేజస్ ఎంకే1ఏ ఫైటర్ జెట్​ల సరఫరా కోసం హెచ్ఏఎల్​తో రక్షణ శాఖ రూ.48 వేల కోట్లతో 2021లో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ జీఈ ఏరోస్పేస్ కంపెనీ నుంచి ఇంజన్ ల సరఫరాలో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ఒప్పందం ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికల్లా ఐఏఎఫ్​కు 6 తేజస్ ఫైటర్ జెట్​లను అందించాల్సి ఉంది.