సెమీస్‌‌లో బోపన్న జోడీ

సెమీస్‌‌లో బోపన్న జోడీ

టురిన్ (ఇటలీ): ఏటీపీ ఫైనల్స్‌‌ టోర్నమెంట్‌‌లో ఇండియా టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న మెన్స్‌‌ డబుల్స్‌‌లో సెమీస్‌‌ చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌‌లో  మూడో సీడ్ బోపన్న (ఇండియా)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట 6–4, 7–6 (7/5)తో రెండో సీడ్ వెస్లీ కూల్ఫొహ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కుప్‌‌స్కీ (బ్రిటన్‌‌) ద్వయంపై విజయం సాధించింది.