శాంటిగో (చిలీ) : రెండు గోల్స్ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయిన ఇండియా ఎఫ్ఐహెచ్ విమెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్లో కొద్దిలో విజయాన్ని చేజార్చుకుంది. గురువారం రాత్రి హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 3–4తో గత ఎడిషన్ రన్నరప్ జర్మనీ చేతిలో పరాజయం పాలైంది.
ఇండియా తరఫున అన్ను (11వ నిమిషం), రోప్ని కుమారి (14వ ని.), ముంతాజ్ (24వ ని.) గోల్స్ చేశారు. ప్రత్యర్థి జట్టులో లారా ప్లట్ (21, 36వ ని.) రెండు గోల్స్తో రాణించింది. శనివారం బెల్జియంతో ఇండియా పోటీ పడనుంది.