
చైనా వేదికగా జరుగుతోన్న ఏషియన్ గేమ్స్ లో భారత్ మరో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. హాంగ్జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన ఉత్కంఠభరితమైన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ ... చైనీస్ తైపీకి చెందిన సుంగ్-హావో హువాంగ్-ఎన్-షువో లియాంగ్లను 2-6, 6-3, 10-4 తేడాతో ఓడించింది. దీంతో భారత్ ఖాతాలో 9 వ స్వర్ణ పతకం వచ్చి చేరింది.