15 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు

15 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు


హైదరాబాద్, వెలుగు : ఎట్టకేలకు 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియెట్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్  రిలీజ్  చేసింది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 30 వరకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని ఇంటర్  బోర్డు సెక్రటరీ నవీన్  మిట్టల్  తెలిపారు. జూన్ 1 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. సర్కారు, ప్రైవేటు కాలేజీలతో పాటు ఎయిడెడ్, రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు చేపట్టవచ్చని చెప్పారు. అయితే అడ్మిషన్  పొందే విద్యార్థి ఆధార్  నంబర్  తప్పకుండా తీసుకోవాలని ఆయన సూచించారు. acadtsbie.cgg.gov.in, tsbie.cgg.gov.in  వెబ్ సైట్లలో గుర్తింపు పొందిన కాలేజీల వివరాలు ఉన్నాయని, వాటిని చూసుకొని అడ్మిషన్లు తీసుకోవాలని ఆయన వివరించారు.